కీర్తి సురేష్ ‘మహనటి’ సినిమా తరువాత ఈమె క్రేజ్ అమాంతం పెరిగింది.మరో క్రేజి బయోపిక్లో కూడా కీర్తి సెలెక్ట్ అయిందనే వార్త వినిపిస్తున్నాయి.అదే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథను సినిమాగా తెరకెక్కించాలని భావిస్తున్నారని సమాచారం.ఇందులో కీర్తి అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.ఇది పక్కన పెడితే రాజమౌళి ఎన్టీఆర్,రాంచరణ్తో మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ని తీసుకున్నాడని సమాచారం.అయితే కీర్తి ఎవరి పక్కన హీరోయిన్గా చేస్తుందో మాత్రం తెలియలేదు.మహనటిలో కీర్తి నటనకు ఫిదా అయిన రాజమౌళి తన మల్టీస్టారర్ సినిమాలో కీర్తిని తీసుకొవలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.ఇది కనుక నిజం అయితే తెలుగులో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్గా మారిపోవడం ఖాయం అని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.