Saturday, April 27, 2024
- Advertisement -

శ్రీరెడ్డి, పూనమ్ మధ్యలో పవన్.. ?

- Advertisement -

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్సియల్ నటి ఎవరంటే వెంటనే శ్రీరెడ్డి పేరు చెబుతారు. ఈ ముద్దుగుమ్మ కావాలనే వివాదాలను కొని తెచ్చుకుంటుంది. ఏ టైంలోనైన సంచలనాలు సృష్టించడానికి రెడీగా ఉండే ఈ భామ.. ఇప్పుడు కూడా అదే చేసింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వివాదస్పద కామెంట్స్ చేసే శ్రీరెడ్డి ఎక్కువగా పవన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్, పోస్టులు పెడుతూ ఉంటుంది.

ఇటీవలే మా అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ ను దారుణంగా తిట్టింది. ఇప్పుడు నటి పూనమ్ కౌర్ పై మండిపడుతుంది. ఈ మధ్య పూనమ్ ఓ సంచలన ట్విట్ చేసింది. అబద్దం ఆడేవాడు రాజకీయ నాయకుడు అవుతాడేమో కానీ.. లీడర్ మాత్రం ఎప్పటికి కాలేడని పేర్కొంది. కాకపోతే పేరు పెట్టలేదు. అయితే పూనమ్ చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ గురించే అని చాలా వార్తలు వచ్చాయి. దాంతో ఆమెపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలో దీనిపై పూనం క్లారిటీ ఇస్తూ మరో ట్విట్ చేసింది. తన ఆలోచనల్లో నిజాలు ఉంటాయని.. ఎదుటివారి ఆలోచనలన్నీ ఊహాగానాలే అని ట్వీట్ చేసింది.

కావాలనే కొన్ని పెయిడ్ వర్గాలు సొమ్మలు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయని చెప్పింది పూనమ్. తాను చెప్పిన మాటపై నిలబడుతానని చెప్పిన పూనమ్ సీన్ లోకి శ్రీరెడ్డి ఎంట్రీ ఇచ్చింది. నీకు దమ్ముంటే ధైర్యంగా ట్వీట్స్ చేయి.. పేరు పెట్టు అంతే కానీ దొంగ చాటు ట్వీట్లు ఎందుకు అంటూ పైర్ అయింది శ్రీరెడ్డి. మొత్తానికి శ్రీరెడ్డి, పూనమ్ కౌర్ మధ్య చిచ్చు రేగింది.. మధ్య లో పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -