Saturday, April 27, 2024
- Advertisement -

రణం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

- Advertisement -

గోపీచంద్ హీరోగా వచ్చిన రణం సినిమాలో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కామ్నా జఠ్మలానీ అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ అమ్మడు తెలుగులో జగపతిబాబు, అల్లరి నరేష్, రాజా, తదితర స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాధించుకుంది.

అయితే ఈ అందాల భామ నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి. దాంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. అందుకే ఈ అమ్మడు 2014లో బెంగళూరుకు చెందినటువంటి ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఈ మద్యకాలంలో కామ్నా జఠ్మలానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన కుటుంబ సభ్యుల ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈమెకు ఓ బాబు ఉన్నట్లు తెలుస్తోంది.

పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి తన భర్తకు వ్యాపారంలో సహాయం చేస్తూ కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే పనిలో పడినట్లు సమాచారం. ప్రస్తుతం భర్తతో కలిసి బెంగుళూరులో నివాసముంటోంది. ప్రస్తుతం ఈమెకు హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి.. మరి ఇతర క్యారెక్టర్స్ ఆఫర్స్ వస్తే చేస్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -