Saturday, April 27, 2024
- Advertisement -

బాబు కోసం ఎల్లోమీడియా ఎంత నీచానికైనా తెగిస్తుంది..

- Advertisement -

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యెల్లో మీడియాపై విరుచుకు పడ్డారు. రాష్ట్రసమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీపై యెల్లోమీడియా తప్పుడు కథనాలను ప్రచురించింది. యెల్లో మీడియా కథనాలను సీఎంవో ఖండించింది. ఉద్దేశపూర్వకంగానే కేంద్రం చిన్న చూపు చూస్తోందని ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకున్నట్లు కథనాలు ప్రచురించడాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి కథనాలు ప్రచురించినట్లు భావిస్తున్నామని, ఈనాడు ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండించింది.

చంద్రబాబుకోసం యెల్లో మీడియా ఎంతకైనా తెగిస్తుందని మండిపడ్డారు.తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సహృదయంతో ఇద్దరు సీఎంలు కలిసి చర్చలు జరిపితే ఎల్లో మీడియా అసత్య కథనాలను ప్రచురించిందని విజయసాయి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎంల అసంతృప్తి అంటూ కథనాలు రాసి కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఎంత నీచానికైనా దిగజారతారంటూ ఘాటు విమర్శలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -