ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతను సాధించిన వైసీపీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే ఆపార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాల్లో మునిగితేలుతున్నారు.ఎట్ల లెక్కింపును సమీక్షించేందుకు జగన్ నిన్న సాయంత్రమే హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి తాడేపల్లిలోని తన సొంతింటికి చేరుకున్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ మొదలైన వెంటనే చాలా స్పష్టమైన ఆధిక్యతతో వైసీపీ దూసుకువస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో తాడేపల్లికి చేరుకున్నాయి.
ఇదలా ఉంటె ప్రస్తుతం విజయసాయిరెడ్డి, జగన్ ఆలింగనం పోటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.తన పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా సాగుతున్న తరుణంలో జగన్ ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి – పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
కష్టమొచ్చినా సుఖమొచ్చినా పెద్దగా తనలో వ్యక్తం కాకుండానే కొనసాగుతున్న జగన్… ఎన్నికల ఫలితాల్లో పార్టీ సాధించబోతున్న విజయం నేపథ్యంలో సాయిరెడ్డిని ఆలింగనం చేసుకోవడం నిజంగానే వైరల్ గా మారిపోయింది. ఈ ఫోటోలను విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.