Friday, April 26, 2024
- Advertisement -

ప్రియురాలు మృతిని త‌ట్టుకోలేక ప్రియుడు ఆత్మ‌మ‌త్య‌….

- Advertisement -

ప్రియురాలు మృతి త‌ట్టుకోలేక ప్రియుడు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని చిదంబరంలో జరిగింది. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం …సొక్కలింగం నగర్‌ కు చెందిన వైదీశ్వరన్‌ (22), బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ చదివి కొంత కాలం విదేశాల్లో ఉద్యోగం చేసి వచ్చాడు. తరువాత అతను విదేశానికి వెళ్లలేదు. ఈ స్థితిలో వైతీశ్వరన్‌ చిదంబరం సమీపం కీళమూంగిలడిలో ఉన్న ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న పాండియన్‌ కుమార్తె రత్తినప్రియ (21) ప్రేమించుకుంటూ వచ్చారు.

గత 9వ తేదీ రత్తినప్రియ ప్రియుడితో సెల్‌ఫోన్‌తో మాట్లాడుతుండగా ఇమె తల్లి ఇంధ్ర (45) చూసి మందలించింది. మనస్తాపంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అంత్యక్రియలకు వెళ్లి వచ్చాడు. ఆపై రాత్రి పూట, ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు, అతని మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. ఆపై మృతదేహం కోసం వైదీశ్వరన్ బంధుమిత్రులు రాగా, అతని మృతదేహాన్ని ఎలుకలు కొరికినట్టు కనిపించింది. దీంతో వారంతా ఆసుపత్రి ముందు నిరసనలకు దిగారు. పోలీసులు స‌ర్దిచెప్పడంతో ఆందోళ‌న విర‌మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -