దేశంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. పూటకో అత్యాచారం, మర్డర్తో కీచకులు మహిళలను చెరబడుతున్నారు. పండు ముసలివాల్లనుంచి అమ్మాయిలు, మైనర్ బాలికలను సైతం వదిలి పెట్టడంలేదు. 9 నెలల చిన్నారిపై మైనర్ బాలు అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెల్తే…రాజస్థాన్లోని కరౌలీ జిల్లాలోని జత్నాంగ్ల గ్రామంలో తొమ్మిది నెలల వయసున్న బాలికపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడైన బాలుడు బాధితురాలి కుటుంబం నివసించే ప్రాంతంలోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. రోజు మాదిరే బాలికతో ఆడుకుంటున్న బాలుడు ఇంటికి తీసుకెళ్తాడనని తీసుకెళ్లి కాసేపటి తర్వాత తిరిగి తీసుకొచ్చాడు. అయితే పాప మర్మాంగాల్లో రక్తస్రావం కావడాన్ని గుర్తించి తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అత్యాచారం జరిగిందని తెలిపారు. షాక్కు గురైన పాప తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఐపీసీ, పోస్కో చట్టాల ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.