ఐపీఎల్ 17వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతోంది సన్రైజర్స్. తాజాగా ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన టీమ్గా రికార్డు క్రియేట్ చేసింది.
పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 125 పరుగులు చేసి సంచలనం సృష్టించింది. 32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లతో 89 పరుగులు చేయగా అభిషేక్ శర్మ 12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 46 పరుగులు చేసి సిక్సర్ల వర్షం కురిపించారు. వీరిద్దరి ధాటికి ఢిల్లీ బౌలర్లు చేతులెత్తేశారు. పవర్ ప్లేలో 11 సిక్స్లు, 13 ఫోర్లు కొట్టారు. 2017లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్గా ఉండగా.. సన్రైజర్స్ 125/0 స్కోర్తో అధిగమించింది.