వివాహిత స్నానం చేస్తుండగా ఓ యువకుడు రహస్యంగా వీడియో తీసి రూ.55 లక్షల యువ్వాలని బ్లాక్ మెయిల్ చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లా కొత్తపేటకు చెందిన యువకుడు ఆత్రేయవరపు వెంకటనాగ సాయికృష్ణ.. తన ఇంటికి సమీపంలో ఉండే వివాహితపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ప్రతి రోజు ఇబ్బంది పెట్టడంతో ఆమె ఈ విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకెళ్లింది. ఆమె భర్త కూడా సాయిని మందలించాడు.
కక్ష పెంచుకున్న సాయికృష్ణ ఇటీవల ఆ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా సెల్ఫోన్లో వీడియో తీశాడు. దాన్ని ఆమెకు చూపించి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన దగ్గర అంత డబ్బులు లేవిని వివాహిత ఎంత చెప్పినా వినిపించుకోలేదు. డబ్బులు ఇవ్వాలని లేకుంటే నెట్ లో వీడియో పెడతానని బెదిరించడంతో చేసేదిలేక భర్తకు విషయం చెప్పింది. దీంతో ఆయన సోమవారం భార్యతో కలిసి కొత్తపేట పోలీస్స్టేషన్కు వెళ్లి సాయికృష్ణపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు సాయి పారరీలో ఉన్నారు.