Saturday, April 27, 2024
- Advertisement -

కన్న కూతిరిపై అత్యాచారం చేసిన తండ్రి…

- Advertisement -

సమాజంలో నెలల చిన్నారి నుంచి కాటికి వెళ్లే వృద్ధురాళ్లపై కూడా హత్యలు, అత్యాచారాలు జరగుతూనె ఉన్నాయి. బయటే కాదు ఇంటిలో కూడా వారికి రక్షణ దొరకడం లేదు. పరిచయం లేని వాళ్ల కంటే సొంత బంధువులే అరాచకాలకు ఒడిగడుతున్నారు. కడుపున పుట్టిన బిడ్డ అని చూడకుండా కామాంధులు కేటేస్తున్న పరిస్థితులు.

తాజాగా అలాంటి ఘటనే వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో వెలుగు చూసింది. కూతిరుని అమ్మలాగా చూసుకోవాల్సిన కామ తండ్రి అత్యాచారానికి ఒడిగట్టాడు.ఆ కామాంధుడి అఘాయిత్యాన్ని పెద్ద కూతురు కళ్లారా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెల్తే….15 సంవత్సరాల క్రితం హన్మకొండకు కుమారస్వామి కుటుంబం తొర్రూరుకు వసల వచ్చింది. కుమారస్వామి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఈ క్రమంలోనె కుమార స్వామి కన్ను తొమ్మిదవ తరగతి చదువుతున్న చిన్న కూతురిపై పడింది.గత మూడు నెలల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బైటకు చెబితే చంపేస్తానంటు బెదిరించాడు. భయపడిన ఆ బాలిక బైటకు చెప్పుకోలేక..తండ్రి పెట్టే దారుణమైన హింస భరించలేక అల్లాడిపోయింది.మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తండ్రి పెట్టే హింసలు భరించలేక అక్కతో తన బాధను చెప్పుకుంది.

ఓ రోజు తెల్లవారుఝామున జరుగుతున్న ఈ దారుణాన్ని కుమార స్వామి పెద్ద కుమార్తె కంటపడింది. ఏంచేయాలో తెలియక బంధువులకు ఈ విషయాన్ని చెప్పింది.వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ కీచక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -