Saturday, April 27, 2024
- Advertisement -

తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు….

- Advertisement -

హైదరాబాద్-ఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. హర్యానాలోని అసౌటి-బల్లబ్‌ఘర్ సమీపంలో రైలులోని రెండు బోగిల్లో మంటలు చెలరేగాయి.ప్యాంట్రీ కోచ్ కి అంటుకున్న మంటలు, థర్డ్ ఏసీ బీ1, స్లీపర్ క్లాస్ ఎస్ 10 బోగీకి వ్యాపించాయి. దీంతో రైలును అక్కడే నిలిపివేశారు.

ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు మంటలు అంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు.ఏసీ బోగీలో షార్ట్‌ సర్య్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ముందుగా B-1 బోగీలో చెలరేగిన మంటలు ప్యాంట్రీ, ఆ తర్వాత S-10 బోగీకి వ్యాపించినట్లు తెలుస్తోంది. బ్రేక్ బైండింగ్ గట్టిగా పట్టి వేయడంతో పొగలు వ్యాపించాయని, ఈ సంఘటనతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు ఉత్తర రైల్వే సీపీఆర్వో ఓ ప్రకటన చేశారు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -