Saturday, April 27, 2024
- Advertisement -

దేశంలో తొలి కరోనా ఫ్రీ టీ షర్ట్..?

- Advertisement -

కరోనా వైరస్ .. గత కొన్ని రోజులుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. అసలు చాలామంది ఈ కరోనా విజృంభణ కాలంలో గడప దాటి కాలు బయటపెట్టలేదు. ఒకవేళ ఏదైనా అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చినప్పటికీ కరోనా భారిన పడకుండా మాస్క్ శానిటైజర్ తీసుకోని వెళ్లారు. ఇక బయటకి వెళ్లి ఇంటికి తిరిగొచ్చామో అంతే ఆ బట్టలు తీసి సర్ఫ్ నీటిలో నానబెట్టి వెంటనే స్నానం కూడా చేస్తుంటారు. అయితే ఇదీ పెద్ద పనీ దీనితో చాలామంది అవసరం ఉన్నా కూడా బయటకి వెళ్లడానికి ఇష్టపడటంలేదు.

దీనిని గమనించిన ఐఐటీ ఢిల్లీ స్టార్టప్ సరికొత్త ఆవిష్కరణ చేపట్టింది. యాంటీ వైరల్ టీ షర్ట్ రక్షణ ఇచ్చే లోషన్ తయారు చేసింది. ఢిల్లీ ఐఐటీకి చెందిన ఇ టెక్స్ కెన్ స్టా స్టార్టప్ లు కలిసి ఓ చక్కటి పరిష్కారం కనుగొన్నాయి. యాంటి వైరల్ టీ షర్ట్ రూపొందించాయి. ఇదీ ధరిస్తే వైరస్ మీ దరిచేరదు. దీంతోపాటు ఇ టెక్స్ మాస్క్ కూడా తయారు చేసింది. ఇటు కెన్ స్టా లోషన్ శానిటైజర్ రూపొందించింది. ఈ నాలుగింటితో కలిసి కిట్ ఏర్పాటు చేశారు. శుక్రవారం కిట్ను ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రామ్ గోపాల్ రావు ఆవిష్కరించారు. వీరికి ఐఐటీ ఢిల్లీ రసాయన శాస్త్ర జౌళి విభాగాలకు చెందిన నిపుణులు సహకరించారు.

యాంటి వైరల్ టీ షర్ట్ 30 సార్లు ఉతికిన కూడా ప్రభావం కోల్పోదని నిపుణులు తెలిపారు. ఇక లోషన్లోని యాంటీ వైరల్ యాంటీ సెప్టిక్ గుణాలు 24 గంటల వరకు కరోనా వైరస్ నుంచి రక్షిస్తాయని తెలిపారు. దీంతో శానిటైజర్ వినియోగం తగ్గించొచ్చు అని ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఆల్కహాల్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. వైరస్ నుంచి రక్షణ కల్పిస్తోందని తెలిపారు. టీ షర్ట్ లోషన్తో వైరస్ను జయించొచ్చు అని నిపుణులు తెలిపారు. ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -