ప్రపంచ దేశాలను భయపెడుతున్న ఒమైక్రాన్ ఇప్పుడు భారత్లో ప్రవేశించిందా ? ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారికి ఎవ్వరికైనా ఒమైక్రాన్ సోకిందా ? లేక భారత్లో ఉన్నవారికే ఈ మహమ్మారి అంటుకుందా ? దేశంలో ఒమైక్రాన్ వస్తే దేశ పరిస్థితి ఏంటి ?
భారత్లో ఒమైక్రాన్ వైరస్ ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రంలో ఇద్దరికి ఈ కొత్త వేరియంట్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇటీవల సౌతాఫ్రికాను పట్టి పీడించిన ఈ మహమ్మారి ఇప్పుడు భారత్లో ప్రవేశించింది. కోత్త వేరియంట్ భారిన పడ్డవారు భారతీయులేనని, వారికి ఇతర దేశాలతో వచ్చిన వారితో ఎలాంటి సంభందాలు లేని ప్రభుత్వం తెలిపింది. కొత్త వేరియంట్ సోకిన వారిని వైద్యులు ప్రత్యేక ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
దీంతో భారత్లో త్రాడ్ వేవ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. అధిక జనాభ కల్గిన దేశంలో రెండో స్థానంలో ఉన్న ఇండియా.. ప్రమాదకరమైన కోవిడ్ కొత్తవేరియంట్ను తట్టుకుంటుదా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. మరి కేంద్ర ప్రభుత్వం మునుపటిలా వ్యవహరిస్తుందా ? లేక ముందస్తుగా న్యూజిలాండ్లో మాదిరిగా లాక్ డౌన్ విధిస్తుందా అనేది చూడాలి.