Friday, April 26, 2024
- Advertisement -

8 నెలల గర్భినిపై గ్యాంగ్ రేప్…..

- Advertisement -

మహిళలు, చిన్న పిల్లు అని తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎనిమిది వారాల గర్భిణి అని చూడకుండా కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. తన ప్రియురాలు కామాంధుల చేతిలో అత్యాచారానికి గురైన ఘటనను జీర్ణించుకోలేని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని బన్స్‌వారా జిల్లాలో గత నెల 13న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెల్తే…దళిత కుటుంబానికి చెందిన ఓ 19 ఏళ్ల బాలిక.. ఓ యువకుడు ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ బాలిక ఎనిమిది వారాల గర్భిణి. జులై 13న రాత్రి 10 గంటల సమయంలో బన్స్‌వారా పట్టణం నుంచి తమ సొంత గ్రామానికి వీరిద్దరూ బైక్‌పై బయల్దేరారు. మార్గ మధ్యంలో మద్యం మత్తులో ఉన్న మృగాళ్లు వారిని అడ్డగించి బాయ్ ఫ్రెండ్ ను చితకబాది అతని వద్ద ఉన్న మొబైల్‌, ఇతర వస్తువులను లాక్కున్నారు. అనంతరం గర్భిణి అయిన బాలికను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అవమానాన్ని భరించలేని ప్రియుడు తన సొంతూరికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆ రాత్రంతా గర్భిణిపై అత్యాచారం చేసిన కామాంధులు వేకువజామున 4 గంటల సమయంలో ఆమెను ఓ ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. గర్భిణిని అత్యాచారం చేసిన వారిలో జితేంద్ర, సునీల్‌, వికాస్‌, నరేష్‌, విజయ్‌ ఉన్నారు.

అఘాయిత్యం జరిగిన తర్వాత సొంతూరుకు వెళ్లిన బాధితురాలి ప్రియుడు అవమాన భారంతో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో మిస్టరీగా మారింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

గర్భిణిని అత్యాచారం చేసిన తర్వాత బాధితురాలి ప్రియుడి వద్ద ఫోన్ లాక్కున్న జితేంద్ర.. ఆ తర్వాత ఆ ఫోన్‌ను తన భార్యకు ఇచ్చాడు. ఆమె ఫోన్ స్విచ్ఛాన్ చేయడంతో.. ఆ సిగ్నళ్ల ఆధారంగా పోలీసులు లొకేషన్‌ను గుర్తించి విచారించారు. తర్వాత జితేంద్రను విచారించడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రియురాలిపై గ్యాంగ్ రేప్ జరగడతంతోనె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని నిర్దారించుకున్న పోలీసులు ప్రియుడి ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు పోలీసులు. ఘటన జరిగిన రోజు బాధిత యువతి పలుమార్లు అతడికి ఫోన్ చేసినట్లు తేలింది.

మొత్తానికి మొబైల్‌ ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా బాధితురాలిని పోలీసులు విచారించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామాంధుల చేతిలో అత్యాచారానికి గురవడంతో బాధితురాలు తన కడుపులో పెరుగుతున్న 8 వారాల పిండాన్ని కోల్పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -