జనసేన అధినేత పవన్కు మరో సారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) ఎక్స్లెన్స్ అవార్డుకు పవన్ ఎంపికయ్యారు. అంతర్జాతీయ వేదికపై పవన్ కళ్యాణ్ అవార్డు ని అందుకోనున్నారు. బ్రిటన్ పార్లమెంట్ గా పిలిచే హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఐఇబి ఎఫ్ వారి కార్యక్రమం ప్రతిఏటా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖుల్ని ఆహ్వానించి అవార్డుని అందజేస్తారు. ఈ సారి పవన్ కళ్యాణ్ కు అవకాశం దక్కింది.
నవంబర్ 17 న లండన్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఉద్దానం కిడ్నీ సమస్య, సామజిక సమస్యల పరష్కారం కోసం పవన్ చూపుతున్న చొరవవని ఐ ఇ బి ప్రతినిధులు ప్రశంసించారు. కార్యక్రమానికి తాను హాజరవుతానని పవన్ వారికీ హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోని వేలాదిమంది కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకోవడంలో పవన్ చూపిన మానవత్వం, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచి నేత కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచిన తీరు, సామాజిక సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ, కృషి ఎన్నో హృదయాలను కదిలించినట్లు వారు ప్రశంసించారు.