- Advertisement -
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ అసహనంతో రగిలిపోతోంది. ఈ విషయంలో అంతర్జాతీయంగా పాక్ ఒంటరి కావడంతో ఇప్పుడు దొంగ దెబ్బ తీసేందుకు పూనుకుంది. రెండు రోజులనుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు పాల్పడుతోంది. తాజాగా జమ్మూకశ్మీర్ లోని కృష్ణా ఘాటి (కేజీ) సెక్టార్లో భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడింది. పాక్ కాల్పుల్లో భారత ఆర్మీకి చెందిన నాయక్ రవి రంజన్ కుమార్ సింగ్ వీరమరణం పొందాడు. పాక్ కాల్పులను భారత్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.