చిన్నారులపై అత్యాచారాలు ఆగడంలేదు. తాజాగా ఆరేళ్ల చిన్నారిపై ఓకామాంధుడు దారుణానికి వడిగట్టారు. పూటుగా మద్యం సేవించి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన కిరణ్ (40) అనే కామాంధుడు ఈదారుణానికి ఒడిగట్టారు.
వివరాల్లోకి వెల్తే….నగరంలోని ఎర్రనాల కొట్టాలకు చెందిన బాలిక తల్లిదండ్రులు బాలికను ఇంట్లోనే ఉంచి ఏదో పని మీద బయటికి వెళ్లారు. తల్లిదండ్రులు బయటకు వెల్లడాన్ని గమనించిన కామాందుడు ఇంట్లోకి వెళ్లి చిన్నారిపై మద్యం మత్తులో అత్యాచారానికి ఒడిగట్టారు. అతను చేస్తున్న పని అర్థంకాని చిన్నారి.. గట్టిగా అరవడాన్ని స్థానికులు గమనించారు. కాగా అప్పటికే నిందితుడు పరారయ్యాడు.
కాగా ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు సముదాయించే ప్రయత్నం చేశారు. స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆందోళనతో ఇంటికి వచ్చిన ఆ తల్లిదండ్రులకు చిన్నారి రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.