కన్న కూతుర్ని కడపులో పెట్టుకొని చూసుకోవాల్సిన ఓ తండ్రి కామంతో కళ్లుమూసుకుపోయి సభ్యసమాజం తలదించుకునే పనికి ఒడిట్టాడు. కూతిరిపై పలు సార్లు అత్యాచారానికి ఒడిగట్టడంతో గర్భం దాల్సింది. తెలిసిన తల్లి విషయం బయటకు రాకుండా అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించింది. డాక్టర్ల ఫిర్యాదుతో పోలీసులు కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….నెల్లూరు జిల్లా జలదంకి మండలానికి చెందిన ఓ బాలిక గర్భం దాల్చింది. కుమార్తె ఇబ్బంది పడుతుండడం గమనించిన తల్లి అనుమానం వచ్చి బాలికను నిలదీసింది. దీంతో జరిగిన విషయం తల్లికి చెప్పింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో తండ్రే తనపై అత్యాచారం చేశాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని తల్లివద్ద వాపోయింది.
దీంతో ఏంచేయాలో తెలియక ఈ విషయం బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోవడంతో పాటు భర్త జైలుకు వెళ్లాల్సి వస్తుందని భావించిన ఆమె కూతురికి గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించేందుకు కావలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం పోలీసుల వరకు వెళ్లిందని తెలియడంతో తప్పు చేసిన తండ్రి చెన్నై పారిపోయేందుకు ముసునూరు వద్ద వాహనం కోసం వేచి ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పు ఒప్పుకోవడంతో కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు పోలీసులు.