నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంగా పేషెంట్ ప్రాణాలతో చెలగాటమాడారు. ఆపరేషన్ చేసి లోపల దూది, కత్లులు మరచిపోవడం సినిమాల్లో తరుచూ చూస్తుంటా. అయితే అలాంటి సంఘటనే ఇప్పుడు నిమ్స్లో చోటు చేసుకుంది. రోగికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఆపై కత్తెరని కడుపులోనే వదిలేసి కుట్లు వేశారు. మూడు నెలల క్రితం మహేశ్వరికి నిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత నొప్పి తగ్గకుండా వస్తుండటంతో కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లి స్కానింగ్ చేయించగా అతడి కడుపులో ఓ సర్జికల్ కత్తెర వున్నట్లు గుర్తించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికిగ గురైన కుటుంబ సభ్యులు,బంధువులు ఇవాళ నిమ్స్ ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెల్తే…హైదరాబాద్ కు చెందిన మహేశ్వరి చౌదరి హెర్నియా సమస్యతో మూడు నెలల క్రితం ఇక్కడి నిమ్స్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే పరిస్థితి మెరుగు కాకపోగా ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఈరోజు తీవ్రంగా కడుపునొప్పి రావడంతో వైద్యులు మహేశ్వరికి స్కానింగ్ చేశారు.. కడుపులో కత్తెర బయటపడింది. మళ్లీ ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు సిద్దమవుతున్నారు. ఆపరేషన్ చేసిన వైద్యులు ప్రస్తుతం అందుబాటులో లేరంటూ సమాధానం ఇవ్వడంతో ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహిరంచిన వైద్యులపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.