Saturday, April 27, 2024
- Advertisement -

ప‌వ‌న్ ప్ర‌చార‌ స‌భ‌లో అప‌శృతి… యువ‌కుడు మృతి..

- Advertisement -

నాయ‌కుల ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో అప‌శృతులు చోటు చేసుకుంటున్నాయి. మొన్న జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌లో పిట్ట‌గోడ కూలి 30 మందికి గాయాల‌య‌వ‌గా.. నిన్ని బాబు రోడ్ షోలో కూడా గోడ కూటి ఒకు మ‌ర‌ణించ‌డంతోపాటు దాదాపు 30 మందిగి గాయ‌ప‌డ్డారు. తాజాగా ప‌వ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా అప‌శృతి చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాలలో ఇవాళ పవన్ కల్యాణ్ పాల్గొన్న సభలో అనూహ్యరీతిలో భారీగా తొక్కిసలాట జరగడంతో ఓ ఆటోడ్రైవర్ ప్రాణాలు విడిచాడు. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. చనిపోయిన వ్య‌క్తి సిరాజ్ గా గుర్తించారు. అతడి వయసు 30 సంవత్సరాలు.

పవన్ కల్యాణ్ హాజరైన సభకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజ‌ర‌య్యారు. సభకోసం ఏర్పాటు చేసిన స్పీకర్లకు ఉన్న ఇనుప రాడ్లు జారిపోవడంతో జనాల్లో తొక్కిసలాట ఏర్పడింది. ఏంజరుగుతుందో తెలియని పరిస్థితిలో ఒకరినొకరు తొక్కుకోవడంతో సిరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయ‌ప‌డిన సిరాజ్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -