Friday, April 26, 2024
- Advertisement -

జగన్ వేడుక కి పవన్ దూరం, మరి చిరు?

- Advertisement -

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి రెండో ముఖ్యమంత్రి గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులకు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకి, ప్రత్యర్థులపై, ఇంకా సినిమా పరిశ్రమ లో ని ప్రముఖులకు ఈ ఈవెంట్ కి రావాల్సింది గా ఆహ్వానాలు పంపారు వైస్సార్సీపీ పార్టీ వర్గాలు. జగన్ మోహన్ రెడ్డి పర్సనల్ గా కొంత మందికి ని కలిసి, మరికొంత మందికి ఫోన్ చేసి మరీ ఆహ్వానాలు అందించడం జరిగింది.

అయితే తాజా ఇండస్ట్రీ కథనాల ప్రకారం జగన్ మోహన్ రెడ్డి మెగా స్టార్ చిరంజీవి కి ఫోన్ చేశారట. ఒక ఐదు నిమిషాలు ఇద్దరూ ఫోన్ లో చర్చించుకున్నారట. జగన్ ముఖ్యమంత్రి అయినందున చిరు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జగన్ కూడా చిరంజీవి ని ఈ ఈవెంట్ కి రావాలని ఆహ్వానించారట. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగా నే జగన్ ఫోన్ చేసినా చిరంజీవి వస్తారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇకపోతే జగన్ పవన్ ని కూడా పిలిచారట కానీ పవన్ ఈ వేడుక కి దూరం గా ఉంటున్నట్టు తెలుస్తుంది. పవన్ మరో మారు ఎప్పుడైనా జగన్ ని కలవాలని నిర్ణయం తీసుకున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -