- Advertisement -
మహారాష్ట్రలోని పూణె శివారులో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది అక్కడిక్కడే మృతి చెందారు. వేగంగా వస్తున్న ఓ లారీ కారును ఢీకొట్టడంతో 9 మంది మృతి చెందారు. పుణె- షోలాపూర్ జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఓ లారీ కదంవక్ వాస్తి గ్రామం దగ్గర్లో ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 9 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులను పూణె సమీపంలోని యవత్ గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.