Saturday, April 27, 2024
- Advertisement -

రెండు రోజుల్లో పెళ్లి..అంత‌లోనె మృత్యుఒడికి చేరుకున్న యువ‌కుడు

- Advertisement -

రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువ‌కుడు అకార‌ణంగా మృత్యువాత పడ్డారు.ఇప్పటికే బంధు,మిత్రులందరికి పెళ్లి పత్రికలు అందజేసి వివాహానికి ఆహ్వానించారు. మిగిలిన వారిని పెళ్లికి పిలిచేందుకు ఇంటి నుంచి బయలుదేరిన యువకుడు రైలు కిందపడి మృత్యువాత పడ్డాడు. దీంతో ఆకుంటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

వివ‌రాల్లోకి వెల్తే….వైఎస్‌ఆర్‌ జిల్లా నంద‌లూరు మండ‌లంనాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని అరవపల్లె తోటపాళెంకు చెందిన కాశి యాసిరాజు అలియాస్‌ కాశి బాబు కుమారుడు కాశి శ్యాం (25)కు ఈనెల 12వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. యువకుడు తన పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు పత్రికలు పంచడానికి వెళ్లాడు.

పెళ్లి ప‌త్రిక‌లు ఇవ్వ‌డానికి మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో నందలూరు ఆల్విన్‌ కర్మాగార సమీపంలో ముంబై నుంచి చెన్నై వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ రైలుకింద పడటంతో రెండు కాళ్లు తెగిపోయాయి. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చి రాజంపేట ›ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

మరో రెండు రోజుల్లో ఆ యువకుడి వివాహం జరగాల్సిన పరిస్థితిలో మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు, బం«ధువులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. రైల్వే పో లీసులు కేసున‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -