వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యయత్నం చేసి కటకటాలు లెక్కపెడుతున్న జనుమిల్లి శ్రీనివాసరావు ప్రస్తుతం జైల్లో విలపిస్తున్నాడటా. జైల్లో ఒంటరితనం భరించలేక.. అంత చిన్న గదిలో ఉండలేక పోతున్నానంటూ విలపిస్తున్నాడని సమాచారం. శ్రీనివాసరావు లాయర్ అబ్దుల్ సలీమ్ ఈ విషయాలను మీడియాకు తెలియజేశారు. ఓ రోజు తనకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఫోన్ వచ్చిందని.. శ్రీనివాసరావు తనను బెయిల్పై బయటకు తీసుకురావాలని కోరుతున్నాడని ఆ ఫోన్ సారాంశమని అబ్దుల్ తెలిపారు.
శ్రీనివాసరావు బయట ప్రపంచంలో తిరిగితే తన ప్రాణానికి ప్రమాదమనే ఇన్ని రోజులు బెయిల్ కోసం అప్లై చేయలేదని.. కానీ ఇప్పుడు తన ఉద్దేశం మార్చుకున్నానని అబ్దుల్ అన్నారు. శ్రీనివాసరావులో డిప్రెషన్, ఫ్రస్టేషన్ పెరుగుతున్నందు వల్లే ఇలా చేస్తున్నాడు కావచ్చు అంటూ ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ శుక్రవారం కానీ.. లేదా సోమవారం కానీ ఎన్ఐఏ కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తానన్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 8తో శ్రీనివాసరావుకు ఎన్ఐఏ రిమాండ్ ముగియనుంది. కానీ ఫిబ్రవరి 22 వరకు రిమాండ్ను పొడిగించే అవకాశం ఉంది.