Friday, April 26, 2024
- Advertisement -

కులం దూషనలతో వైసీపీ ఎమ్మెల్యే కంటతడి….

- Advertisement -

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి టీడీపీపై నిప్పులు చెరిగారు.టీడీపీ నేతలు తనను కులం పేరుతో దూషించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఏ1గా కొ్మినేని శివయ్య. ఏ2గా కొ్మ్మినేని సాయి, ఏ3గా కొమ్మినేని రామకృష్ణ, ఏ4గా కొమ్మినేని బుజ్జిగా పేర్కొన్నారు పోలీసులు.అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ నేతలు తనను అవమానపరుస్తున్నారని ఆమె గుర్తు చేశారు.

వినాయకచవితి ఉత్సవాలకు వెళ్లిన తనను టీడీపీ నేతలు కులం పేరుతో దూషించారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. వినాయక మండపంలో దళితులు పూజ చేస్తే దేవుడికి మైల అంటుతుందని టీడీపీకి చెందిన వారు దూషించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో దళితులకు న్యాయం జరగలేదన్నారు. అందుకే దళితులు వైఎస్ఆర్‌సీపీ వైపు మొగ్గు చూపారన్నారు. దళితులను అణగదొక్కేందుకు టీడీపీ ప్రయత్నం చేసిందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -