Friday, April 26, 2024
- Advertisement -

తండ్రిని చూడటానికి వెళ్తానన్న అమృత.. తల్లి ఏమన్నాదంటే ?

- Advertisement -

మిర్యాలగూడలో కూతురు అమృత దళిత యువకుడిని చేసుకుందని ఆగ్రహించిన చంపించిన మారుతీరావు చివరకు హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకోవడంతో ఈ మొత్తం కథ విషాదంతంగా మిగిలింది. అయితే తండ్రిని చూసేందుకు వెళ్లాలని అమృత నిర్ణయం తీసుకుంది. తన తండ్రిని కడసారి చూస్తానని పోలీసుల భద్రత కోరింది.

ఇది ఇలా ఉంటే అమృత తండ్రిని చూసేందుకు తాము అంగీకరించలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని మారుతీరావు తమ్ముడు శ్రవణ్, అమృత తల్లి అన్నారు. అమృతను అంత్యక్రియలకు రావొద్దని చెప్పలేదని.. మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటిక (షాబునగర్)లో కుటుంబ సభ్యులు అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. మారుతీరావు పోలీసులు అంతిమ యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమృత అత్తింటి దగ్గర భారీ భదత్ర కల్పించారు. తమ్ముడు శ్రవణ్ అన్న మారుతీరావుకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మారుతీరావు ఆదివారం హైదరాబాద్ ఆర్యవైశ్య భవన్‌లో అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఆయన విషం తీసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయే ముందు ఓ చిన్న సూసైడ్ నోట్ కూడా రాశారు. తన సూసైడ్ నోట్ లో భార్యకు క్షమాపణలు చెప్పి.. తల్లి దగ్గరకు కుమార్తె వెళ్లిపోవాలంటూ రాసి ఉందని తెలుస్తోంది. ఇక ఉస్మానియాలో డెడ్‌బాడీకి పోస్ట్‌మార్ట్ నిర్వహించి.. ఆదివారం సాయంత్రం మిర్యాలగూడకు తరలించారు. మరోవైపు మారుతీ రావు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చింది. ఆయన విషం సేవించడం వల్లే చనిపోయారని ప్రిలిమినరీ రిపోర్టులో తేలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -