Saturday, April 27, 2024
- Advertisement -

త‌ట‌స్థ ఓట‌ర్లే టార్గెట్‌గా వైఎస్ జ‌గ‌న్ స‌రికొత్త ప్లాన్‌…

- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త ప్లాన్‌కు శ్రీకారం చుట్టింది. పాద‌యాత్ర‌లో వెల్ల‌ని నియోజ‌క వ‌ర్గాల్లో బ‌స్సుయాత్ర‌కు సిద్వ‌మ‌వుతున్నారు. ఇక ఏపీలో మిగిలిన తటస్థులను ఆకర్షించేందుకు స‌రికొత్త కార్య‌క్ర‌మాన్ని ఎంచుకుంది వైసీపీ . ఎన్నికల వ్యూహకర్త పీకే మరియు అతని టీం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తటస్థులను గుర్తించి ఆ జాబితాను ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తటస్థులకు లేఖలు రాయ‌ల‌ని న‌ర్ణ‌యించుకున్నారు.

అన్న పిలుపు’ అనే పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాలో తాను చూసిన సమస్యలను ఈ లేఖలో జగన్ వారికి వివరించనున్నారు. సమస్యలను పరిష్కరించడానికి కలిసిరావాలనీ, సలహాలు, సూచనలు అందించాలని కోరనున్నారు. ఈ నేపథ్యంలో లేఖ చివర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సబంధించిన ఈ మెయిల్, ఫోన్ నంబర్ ను కూడా లేఖలో పొందుపరిచారు.

జ‌గ‌న్ వారందరిని స్వయంగా కలుసుకోనున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. తటస్థులను ఆకర్షించడం ద్వారా వైసీపీ విజయావకాశాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో త‌ట‌స్థుల‌ను గుర్తించిన జ‌గ‌న్ ఆయా నియోజ‌క వ‌ర్గాల స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌కు ప‌లు సూచ‌న‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. తటస్థులను గుర్తించి వారి మద్దతు దక్కించుకోవడంతోపాటు వారి సూచనలు తీసుకోవడం వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులయ్యేలా చూడాలని కోరారు. అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌యత్నాలు ఎంత‌మేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -