Friday, April 26, 2024
- Advertisement -

బాబు ఆవు డైలాగ్ కు …దున్నపోతుతో కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత సి. రామచంద్రయ్య

- Advertisement -

ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవడం, టీడీపీ ఓటమిపాలు కావడాన్ని చంద్రబాబునాయుడు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రతీ రోజు జగన్ పై బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్న సంగతి తెలిసిందే. కొడుకు లోకేష్ లాగే చంద్రబాబుకూడా ట్విట్ట వేదిక ఎక్కారు. ఇప్పటి వరకు లోకేషే అనుకుంటే….ఇప్పుడు కొడుకు సరసన బాబు చేరాడు.

ఎన్నికల్లో ఓటమిపై బాబు కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఎవరికీ అర్థం కావడం లేదని సన్నాయి నొక్కులు నొక్కారు. 23 సీట్లు ఇచ్చే అంత తప్పు తానేమీ చేయలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో పాలు ఇచ్చే ఆవును వదిలేసి దున్నను తెచ్చుకున్నారంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పాలిచ్చే ఆవును వదిలిపెట్టుకుని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు’ అన్న చంద్రబాబు వ్యాఖ్యలకు దున్నపోతుతో కౌంటర్ ఇచ్చారు వైసీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య . ప్రజాస్వామ్యంలో ఓటమికి ప్రజలనే బాధ్యులను చేసిన ఏకైక నేత చంద్రబాబే అని విమర్శించారు. పాలిచ్చే ఆవు’ అని భావించి 2014లో చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారని, అయితే, బాబు ‘తన్నే దున్నపోతు’ అని తెలియడంతో మొన్నటి ఎన్నికల్లో ఓడించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలన ప్రజలకు ఎన్నో అనుభవాలు నేర్పిందని, ఎన్ని విన్యాసాలు చేసినా ఆ పార్టీ ఇక కోలుకోలేదని జోస్యం చెప్పారు.

అవినీతి చేయకుంటె అసలు బాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. జగన్ ఢిల్లీ వెళితే, తనపై ఫిర్యాదు చేసేందుకే వెళ్లారని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆయన మానసిక స్థితి సరిగా ఉందా? లేదా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటే తాను తప్పులు చేసినట్లు చంద్రబాబు ఒప్పుకొన్నట్లేనా అని ఆయన ప్రశ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -