మనం రోజు ఉదయాన్నే ఏదో ఒక పానియం తీసుకుంటాం.అది మనసును ఉల్లాసంగా ఉంచుతంది.కాని ఆ పానియం ప్రతీ రోజు సేవిస్తే జబ్బుల నివారనతోపాటు మరనాన్నికూడా దూరంగా పెట్టె అద్భుతమైన పానియం.ఆ పానియం మీద వస్తున్న అపోమలు పక్కనబెట్టి నిక్షేపంగా దాన్ని సేవించవచ్చని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు.
రోజుకు రెండు, మూడు కప్పుల వరకు ఆ పానీయం తాగినా ప్రమాదం లేదట. పైగా మరణ ప్రమాదం మరింత తగ్గుతుందని వీరంటున్నారు. కాబట్టి ఈ పానీయాన్ని ఇన్నాళ్లూ సేవిస్తూ వచ్చినవారు ఇక నిక్షేపంగా కాస్త ఎక్కువే లాగించవచ్చట.
గుండె జబ్బులు మొదలుకుని కేన్సర్, మధుమేహం, శ్వాస, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ప్రాణాలకొచ్చే ముప్పుకు కాఫీకి మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు పరిశోధకులు. కాఫీ ఎక్కువగా తాగితే ఆయుష్షు పెరుగుతుందా, అన్ని రకాల వ్యాధుల నుంచి ప్రాణాలకు వచ్చే ముప్పు తగ్గుతుందా.. అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు. దాదాపు 2.15 లక్షల మందిపై జరిపిన అధ్యయనం ద్వారా తెలిసిందని వెరోనికా సెటీవాన్ తెలిపారు. ఇతరులతో పోల్చినప్పుడు రోజుకో కప్పు కాఫీ తాగే వారికి మరణం సంభవించే అవకాశం 12 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. రెండు మూడు కప్పులు తాగే వారి విషయంలో ఈ సంఖ్య 18 శాతమని చెప్పారు.
కెఫీన్ రహిత కాఫీల్లో దేన్ని తీసుకున్నా ప్రభావం మాత్రం ఒకే తీరున ఉందని చెప్పారు. కాఫీతో కొన్ని రకాల కేన్సర్లు, మధుమేహం, లివర్ సంబంధిత వ్యాధులను నివారించవచ్చని గతంలో ఒక అధ్యయనంలో తేలినప్పటికీ.. ప్రాణాలకు వచ్చే ముప్పు తగ్గుతుందని విశ్లేషించిన తొలి అధ్యయనం మాత్రం ఇదేనని సెటివాన్ తెలిపారు.
ఇంకేం మరి ఉదయం, సాయంత్రం, రాత్రి కాఫీ రాగాన్ని ఆలపిస్తూ నిక్షేపంగా కాఫీని సేవించండి. భయపడాల్సిన పనే వద్దు.ఇది కాఫీ ప్రియులకు శుభవార్తే.