భారత క్రికెట్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్ కు ఓ టెస్ట్ సిరీస్ లో తనకు నిద్రపట్టలేదని.. అతను వేసే బత్తులకు కంగారు వచ్చేదాని.. అర్దరాత్రులు అతని బౌలింగ్లో ఔట్ అయ్యానేమనని ఉలిక్కిపడేవాడనని ఆసీస్ ఓపెనర్, పరిమిత ఓవర్ల కెఫ్టెన్ అరోన్ ఫించ్ అన్నారు. బుమ్రా ధాటికి 2018 బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత ఈ స్టార్ ఓపెనర్ మళ్లీ సంప్రదాయక క్రికెట్ ఆడలేదు.
భారత్తో జరిగిన ఈ మూడు టెస్ట్ల సిరీస్లో ఫించ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్ లో భారత్ 2-1తో సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆసీస్ గడ్డపై భారత్ గెలిచిన మొదటి టెస్ట్ సిరీస్ ఇదే. ఈ సీరిస్ లో బుమ్రా ప్రధాన పాత్ర పోషించాడు. బుమ్రా దాటికి ఫించ్ రెండు సార్లు ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడంలో ఈ ఆసీస్ ఓపెనర్ చాలా ఇబ్బంది పడ్డాడు. తాజాగా ఆస్ట్రేలియా జట్టుపై అమెజాన్ ప్రైమ్ రూపొందించిన డాక్యుమెంటరీలో బుమ్రా బౌలింగ్లో ఎదుర్కొన్న సమస్యలను ఫించ్ చెప్పుకొచ్చాడు.
ఈ డాక్యుమెంటరీలో 2018 బాల్ టాంపరింగ్ వివాదం, 2001 నుంచి ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ సిరీస్ను ఎలా కాపాడుకుందనే విషయాన్ని ప్రధానంగా తెరకెక్కించారు. భారత్తో జరిగిన టెస్ట్సిరీస్లో తనకు నిద్ర కూడా పట్టేది కాదని ఫించ్ ఈ డాక్యుమెంటరీలో తెలిపాడు. మళ్లీ బుమ్రా ఔట్ చేసినట్లు పదేపదే ఊహించుకునేవాడినన్నాడు. ‘బుమ్రా మళ్లీ ఔట్ చేశాడేమోనని తలుచుకొని అర్థరాత్రులు ఉలిక్కిపడేవాడిని. ఆ సిరీస్ చాలా కష్టతరంగా గడిచిందని” ఫించ్ చెప్పారు.