Saturday, April 27, 2024
- Advertisement -

టెస్ట్ సిరీస్ విజ‌యంపై కోహ్లీ స్పంద‌న‌…

- Advertisement -

ఆసిస్ గ‌డ్డ‌పై టీమిండియా దశాబ్దాల కల నెరవేరింది. 4 టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ కైవసం చేసుకోవడంతో 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. వారి సొంత గ‌డ్డ‌పై వారిని ఓడించి తొలి టెస్టు సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని కోహ్లీ సేన ముద్దాడి విదేశీగడ్డపై సత్తా చాటింది. విజ‌యంపై కోహ్లీ స్పందించారు.

భార‌త జ‌ట్టుకి ఇంత కంటె గొప్ప విజ‌యం మ‌రొక‌టి ఉండ‌ద‌న్నారు. తన జీవితంలోనే ఇది బెస్ట్ అచీవ్‌మెంట్ అని పేర్కొన్నాడు. టీమిండియాను చూస్తుంటే గర్వంగా ఉంది. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి మూమెంట్ రాలేదు. టీమిండియాను లీడ్ చేస్తూ చారిత్రక విజయం సాధించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ క్షణాలను తప్పుకుండా మేం ఎంజాయ్ చేస్తాం.. అని కోహ్లీ తెలిపాడు.

నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపైనే నేను తొలిసారి టెస్టు కెప్టెన్‌గా జట్టు బాధ్యతలు అందుకున్నా. ఇప్పుడు గొప్ప ఆటగాళ్లతో నిండిన జట్టుని నడిపిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను’ అని విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -