Friday, April 26, 2024
- Advertisement -

రోహిత్,మయాంక్ సెంచరీలు…జోరుమీదున్న భారత్…

- Advertisement -

విశాఖలో సఫారీలతో జరుగుుతన్న మొదటి టెస్ట్ లో భారత్ దూసుకుపోతోంది.ఇద్దరు ఓపెనర్లు రోహిత్, మయాంక్ సెంచరీలతో కథం తొక్కారు. తొలిరోజు రోహిత్ సెంచరీ చేయగా రెండో రోజు మయాంక్ సెంచరీ చేశారు.203 బంతుల్లో సెంచరీ సాధించాడు మాయంక్‌. ఇది మయాంక్‌ అగర్వాల్‌కు తొలి టెస్టు సెంచరీ. ఫలితంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో సెంచరీ సాధించిన 86వ భారత్‌ ఆటగాడిగా మాయంక్‌ గుర్తింపు సాధించాడు.

ఆటలో రెండో రోజైన గురువారం ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 84తో ఈరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన మయాంక్ అగర్వాల్ (100 బ్యాటింగ్: 204 బంతుల్లో 13×4, 2×6) తొలి సెషన్‌ ఆరంభంలోనే సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. భారత్ జట్టు 69 ఓవర్లు ముగిసే సమయానికి 240/0తో కొనసాగుతోంది. మయాంక్‌తో పాటు మరో ఓపెనర్ రోహిత్ శర్మ (137 బ్యాటింగ్: 209 బంతుల్లో 16×4, 5×6) అజేయ శతకంతో కొనసాగుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -