- Advertisement -
359 పరుల భారీ లక్ష్యఛేదనతో దిగిన ఆసిస్ జట్టుకు ఆదిలోనె బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ కెప్టెన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్ (0) పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరాడు. భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నాలుగో బంతికి ఫించ్ క్లీన్బౌల్డ్ అయ్యాడు.అనంతరం బూమ్రా బౌలింగ్లో షాన్ మార్ష్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్లో ఖవాజా 6 పరుగులు, హాండ్స్ కాంబ్ 13 పరుగుతలతోనూ ఆడుతున్నారు. 6 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగులతో ఆసిస్ బ్యాటింగ్ను కొనసాగిస్తోంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు చేసింది. శిఖర్ సెంచరీతో చెలరేగగా, రోహిత్ కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నారు.