Friday, April 26, 2024
- Advertisement -

ఢిల్లీ ని క్రుంగదీసిన ఓటమి చాలక.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కి షాక్..!!

- Advertisement -

వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న ఢిల్లీ కి నిన్న హైదరాబాద్ రూపంలో ఓ ఓటమి ఎదురైంది.. లక్ష్య ఛేదనలో తడబ్బాడు ఢిల్లీ పదిహేను పరుగుల తేడాతో ఓడిపోయింది. గెలుస్తున్నంత సేపు ఏ జట్టుకైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఓడిపోతే మాత్రం అన్ని అపశకునాలు నెత్తిమీద వచ్చి పడతాయి.. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు మరో షాక్ తగిలింది.

స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు ఐపీఎల్ రూ. 12 లక్షల జరిమానా విధించింది. కనీస ఓవర్ రేట్ తప్పిదం కారణంగా ఐపీఎల్ నియమావళి కింద అయ్యర్‌కు జరిమానా విధించినట్టు పేర్కొంది. స్లో ఓవర్ రేట్‌కు ఈ సీజన్‌లో జరిమానా ఎదుర్కొన్న తొలి జట్టు ఢిల్లీనే.

హైదరాబాద్ వికెట్లు పడగొట్టేందుకు ఢిల్లీ కెప్టెన్ అయిన శ్రేయాస్ బౌలింగ్‌లో పలు మార్పులు చేశాడు. బౌలర్లతో చర్చలు జరిపాడు. ఈ క్రమంలో నిర్దేశిత సమయంలో బౌలింగ్ కోటాను జట్టు పూర్తి చేయలేకపోయింది. దీంతో ఐపీఎల్ నియమావళి కింద జరిమానా విధించారు. కాగా, హైదరాబాద్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఢిల్లీ తొలి ఓటమిని నమోదు చేసింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -