ఫోన్ ట్యాపింగ్.. టీడీపీ లేవనెత్తడంతో రాజకీయాల్లో ఈ అంశం చర్చగా మారింది. చంద్రబాబు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు అధికార జగన్ ప్రభుత్వం మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. బాబు మాట్లాడకుండా ఏపీ డీజీపీ ద్వారా గట్టి జవాబును అందించింది. తాజాగా చంద్రబాబుకు డీజీపీ లేఖ రాశారు.
ఇందులో ఏపీ పోలీసులు జోక్యం చేసుకోవడం అనూహ్య మలుపుగా రాజకీయవర్గాలు అభివర్ణిస్తున్నాయి. అసలు వివాదం ఏంటంటే.. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ప్రధానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాజ్యాంగంలోని 19,21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లు ట్యాపింగ్ కు గురి అవుతున్నట్లు తన లేఖలో బాబు పేర్కొన్నారు. ఇప్పుడు బాబు లేఖపై ఏపీ రాష్ట్ర డీజీపీ కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది.
చంద్రబాబుకు ఆయన ప్రతి లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కు వైసీపీ నేతలు పాల్పడ్డారనడానికి సాక్ష్యాలు ఉంటే తమకు తెలియజేయాలని కోరారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి తాము కఠిన చర్యలు తీసుకుంటామని.. సమగ్ర దర్యాప్తు చేస్తామని.. దర్యాప్తుకు సహకరించాలని డీజీపీ తాజాగా చంద్రబాబుకు లేఖ లో కౌంటర్ ఇచ్చారు.
వైసీపీలో గంటాను తీసుకోకపోవడానికి కారణం ఇదే ?
అలా చేస్తే జగన్ సర్కార్ కు చాలా నష్టం : వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు
