టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తాజాగా సంచలన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతుందంటూ ట్వీట్ చేసి తీవ్ర కలకలం రేపారు.
పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది.. సీఎంని తప్పుగా చూపించడానికి.. ‘వైఎస్ జగన్ గారు మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కీ, మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం’అంటూ ట్వీట్ చేశారు. #APisWatching హ్యాష్ట్యాగ్ను పెట్టారు. రామ్ పెట్టిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
ఈ ట్వీట్ ఎవర్ని ఉద్దేశించి పెట్టారన్నది చర్చనీయాంశమైంది. జగన్పై కుట్ర చేస్తుంది ఎవరు.. అంతేకాదు ఆయన దగ్గర పనిచేసే వారే అంటూనే.. వాళ్లపై ఓ కన్నేసి ఉంచాలంని హెచ్చరించడంపై నెటిజన్లలో కూడా చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఈ ట్వీట్పై స్పందిస్తున్నారు.. కుట్ర చేస్తుంది ఎవరూ అంటూ ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో రామ్ కు ధన్యావాదాలు చెబుతున్నారు జగన్ అభిమానులు.
జగన్ కు షాక్.. రాజధాని అమరావతిలో మార్పు లేదు..!
బీజేపీ మహిళా నేత సాధినేని యామినిపై కేసు నమోదు..!