తెలంగాణాలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. దుబ్బాక లో ఉప ఎన్నికక కోసం ఇప్పటికే అన్ని పార్టీ లు కసరత్తులు మొదలుపెట్టగా ఎలక్షన్ డేట్ ఇంకా రాకపోవడంతో అందరిలో అంతటి ఉత్తేజం ఇంతవరకైతే పార్టీ శ్రేణుల్లో కనపడలేదు.. అయితే నేటి ఉప ఎన్నిక నోటిఫికేషన్ తో ఓ కొత్త ఉత్సాహం అయితే దుబ్బాక లో నెలకొంది అని చెప్పొచ్చు.. అధికార పార్టీ ఎమ్మెల్యే మరణించడంతో దుబ్బాక లో ఉపఎన్నిక లాంచనం అయ్యింది… ఇప్పటికే ఆ ప్రాంతం పై అన్ని పార్టీ లు గెలుపుకోసం కసర్థులు మొదలుపెట్టగా అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ ఇప్పతిఎక్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
రామలింగారెడ్డి భార్య సుజాతను బరిలోకి దింపేందుకు దాదాపు నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయంలో అధికారికంగా ఎటువంటి నిర్ణయమూ వెలువడనప్పటికీ సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి దుబ్బాక నుంచి బరిలోకి దిగేందుకు రామలింగారెడ్డి కుటుంబంతోపాటు మాజీ మంత్రి ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్రెడ్డి కూడా సీటును ఆశిస్తున్నారు. మరోవైపు, దుబ్బాక టికెట్ను తన కుమారుడు సతీశ్రెడ్డికి ఇవ్వాలని రామలింగారెడ్డి భార్య కోరుతున్నారు. అయితే, అధినాయకత్వం మాత్రం సుజాతవైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
ఇక ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం దుబ్బాక లో ఉప ఎన్నిక నవంబర్ 3న పోలింగ్ జరగనుంది.. అదే నెల 10న ఫలితాలు విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు అందులో దుబ్బాక ఒకటి అన్నట్లు తెలుస్తుంది. నామినేషన్ల దాఖలకు ప్రారంభం తేదీ అక్టోబర్ 9 కాగా.. చివరి తేదీ అక్టోబర్ 16 గా నిర్ణయించారు. ఉపసంహరణకు అక్టోబర్ 19 వరకు గడువు ఇచ్చింది. దీంతో అన్ని పార్టీ లు దుబ్బాక లో గెలవడానికి రంగాలు సిద్ధం చేసుకుంటాయి. మరి ప్రజలు ఎ పార్టీ కి కిరీటం కట్టబెడతారో చూడాలి..