Saturday, May 10, 2025
- Advertisement -

దేవుడికి ఉత్తరప్రదేశ్ కి లొల్లి.. మధ్యలో సుప్రీం..!

- Advertisement -

కృష్ణ భగవానుడి పేరు చెప్పి వేల వృక్షాలను నరికివేస్తామంటే అనుమతించబోమని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కూల్చివేసే ప్రతి చెట్టు మూల్య నిర్ధరణ జరగాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.ఎ.బోబ్డే, జస్టిస్​ ఎ.ఎస్​. బోపన్న, జస్టిస్​ వి.రామసుబ్రమణియన్​లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఒక వృక్షం తన జీవిత కాలంలో ఎంత ప్రాణవాయువును ఉత్పత్తి చేయగలదో వెల్లడించే వివరాలూ ఆ మూల్యాంకనంలో భాగంగా ఉండాలని తెలిపింది. మథురలో నిర్మించనున్న కృష్ణ-గోవర్ధన్​ రహదారి ప్రాజెక్టు కోసం 2,940 వృక్షాలు కూల్చేందుకు అనుమతి కోరుతూ ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా పనుల విభాగం అభ్యర్థనను దాఖలు చేశాయి.

ఈ క్రమంలో తాజ్​మహల్​ పరిరక్షణ విషయమై పర్యావరణవేత్త ఎం.సి మెహతా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది సుప్రీం ధర్మాసనం. విచారణలో భాగంగా ఎన్ని చెట్లను నరికివేయాలని ప్రతిపాదిస్తున్నారో తెలపాలని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

Also Read

ప్రాణం తీసిన ఆక్సిజన్ సిలిండర్..!

శశికళ జైలు శిక్షలో కుదింపు..!

చంద్రుని పై చైనా కొత్త పోరాటం..!

తమిళనాట ” బురేవి ” అలెర్ట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -