గ్రేటర్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అధికార పార్టీ టీఆర్ఎస్ తన జోరు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. దానితో పాటు ఎంఐఎం కూడా జోరు కొనసాగిస్తుంది. ఇక గత ఎన్నికల్లో సాధించిన ఫలితాల కంటే రెట్టింపు విజయంతో బీజేపీ తన సత్తా చాటింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ పై తాజా సమాచారం ప్రకారం… టీఆర్ఎస్ ఇప్పటివరకు 44 డివిజన్లను కైవసం చేసుకుని మరో 14 డివిజన్లలో గెలుపు దిశగా దూసుకువెళుతోంది.
ఎంఐఎం 38 డివిజన్లలో విజయం నమోదు చేసుకుని 4 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 34 డివిజన్లలో గెలిచి మరో 13 డివిజన్లలో ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ కు రెండు డివిజన్లు దక్కాయి. ఇదిలా ఉంటే.. ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అర్ధాంగి స్వప్న ఓటమి చవిచూశారు.
స్వప్న హబ్సీగూడ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎమ్మెల్యే అర్ధాంగికి బీజేపీ అభ్యర్థి షాకిచ్చింది. హబ్సీగూడలో బీజేపీ అభ్యర్థి చేతన విజయం సాధించింది. మరోవైపు నగర మేయర్ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి యాదవ్ చర్లపల్లి డివిజన్ లో జయభేరి మోగించారు. శ్రీదేవి యాదవ్ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సురేందర్ గౌడ్ నెగ్గారు.
Also Read
గ్రేటర్ ఫైట్ : ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థులు..
జీహెచ్ఎంసీ ఫైట్ : ఆధిక్యంలో కారు.. ఉనికి చాటుకున్న కమలం!