Saturday, May 4, 2024
- Advertisement -

మరో దిశ ఘటన.. యువతిని దారుణంగా తగలబెట్టి హత్యచేశారు!

- Advertisement -

దేశంలో ఇప్పటి వరకు బాలికలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధానిలో నిర్భయ అత్యాచారం, తెలంగాణలో దిశ అత్యాచారం, హత్య ఎన్నో జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా యువతిని కిరాతకంగా హత్య చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టిన అమానుష ఘటన వెలుగుచూసింది. అనంతపురం ఎస్బీఐలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న స్నేహలత దారుణ హత్యకు గురైంది.

ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద పొలాల్లో ఆమె మృతదేహం లభ్యమైంది. యువతిని నమ్మించి మోసం చేసి దారుణంగా హత్యకు పాల్పపడి ఉంటారని అంటున్నారు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పాక్షికంగా తగలబడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. సంఘటన స్థలంలో దొరికిన ఐడీ కార్డు ఆధారంగా ఆమెను స్నేహలతగా గుర్తించారు.

అయితే మృతి చెందిన యువతి ప్రియుడే ఈ హత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాజేష్, కార్తీక్ అనే యువకులే తమ కూతురిని హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యువతిని చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -