రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో వైసిపిలోని పెద్ద తలకాయల స్థానాలను తెలుగుదేశం మడతపెట్టిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తెలుగుదేశం కార్యకర్త నుంచి కార్యదర్శి వరకూ వెన్నుచూపని పోరాటంతోనే పంచాయతీల్లో పట్టు సాధించామన్నారు.
బెదిరించి ఏకగ్రీవాలు చేసుకోవడం, చంపేస్తామని హెచ్చరించి విత్డ్రా చేయించడమూ విజయమేనా అని లోకేష్ నిలదీశారు. జనం ఇంకా వైకాపా వైపే ఉన్నారని నమ్మకం, దమ్ము ఉంటే అధికార దుర్వినియోగం చేయకుండా.. 3,4 విడతల్లో పోటీ చేయాలని ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని సవాల్ విసిరారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందటం అత్యంత బాధకరమని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కవల పిల్లలను ఎత్తుకుపోయిన కోతులు..శిశువు మృతి