Tuesday, April 30, 2024
- Advertisement -

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొత్త పదవి..!

- Advertisement -

ఈ మద్య ఏపిలో రాజకీయాల్లో అనూహ్య మార్పులు చేర్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పంచాయితీ రాజ్ ఎన్నికల్లో వైసీపీ తన అధిక్యాన్ని చాటిన విషయం తెలిసిందే. తాజాగా తిరుపతి వేదికగా మార్చి 4న జరగనున్న దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు.

సదరన్ జోనల్ కౌన్సిల్‌కు ఏపీ సభ్యుడిగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశిలిచ్చారు. మరోవైపు సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున విభజన అంశాలపై మాట్లాడేందుకు ప్రభుత్వం సలహాదారును నియమించింది.

విభజన అంశాలు, ఉద్యోగుల పంపకం తదితర అంశాలను పర్యవేక్షిస్తున్న ఎక్స్ అఫీషియో ముఖ్యకార్యదర్శి, విశ్రాంత ఐఎఎస్ అధికారి ఎల్. ప్రేమ్ చంద్రారెడ్డిని సలహాదారుగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.

బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి!

ప్రేమలో ప‌డ్డ సాయి ప‌ల్లవి !

ఉప్పెన’ గురించి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఏమ‌న్నాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -