తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. బంజారాహిల్స్ లోటస్పాండ్లోని ఆమె నివాసానికి చెందిన పలు విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులతో షర్మిల భేటీ అయ్యారు.విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు తీరు, తదితర అంశాలపై షర్మిల విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణలో పార్టీ పెట్టడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా.. గత శనివారం ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కుమారుడు రవికాంత్… షర్మిలను కలిశారు.
రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలు, పలు అంశాలపై ఎమ్మెల్యే కుమారుడితో షర్మిల చర్చించారు. టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే కుమారుడు వైఎస్ షర్మిలను కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులు వీరే..?
మెదడు పనితీరు మెరుగు పడాలంటే..