Saturday, April 27, 2024
- Advertisement -

ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులు వీరే..?

- Advertisement -

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువు ఉంది. హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్​నగర్​, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.

మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్​నగర్‌ స్థానానికి తెరాస తరఫున సురభి వాణీదేవి, బిజెపీ నుంచి రాంచందర్‌రావు, కాంగ్రెస్​ నుంచి చిన్నారెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ, స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్​ నాగేశ్వర్​ నామపత్రాలు సమర్పించారు.

వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి తెరాస తరఫున పల్లా రాజేశ్వర్​రెడ్డి, బిజెపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్​ తరఫున రాములు నాయక్​, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్‌, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమదేవి, స్వతంత్ర అభ్యర్థులు తీన్మార్‌ మల్లన్న, సుదగాని హరిశంకర్‌ నామపత్రాలు దాఖలుచేశారు.

అల్లరి న‌రేష్ తో దిల్ రాజు సినిమా !

అందరికీ షాక్.. మనిషి ముఖాన్ని పోలిన సొరచేప…!

రూ.1కే ఇంటి రిజిస్ట్రేషన్..సీఎం జగన్ కీలక నిర్ణయం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -