విజయవాడలోని గన్నవరం పరిసరాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. ఈ కారణంగా.. విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే.. ఎయిరిండియా విమానానికి ల్యాండింగ్ సమస్య ఎందురైంది. గంటపాటు.. ఆ విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఢిల్లీ నుంచి బయల్దేరిన ఈ విమానం.. గన్నవరం చేరుకోవాల్సి ఉంది.
చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని రెండు రోజులు రద్దుచేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకుని ఇక్కడి నుంచి మహారాష్ట్రలోని కొల్హాపూర్కి వెళ్లే ఈ విమానం.. తిరిగి అక్కడి నుంచి తిరుపతి మీదుగా హైదరాబాద్కు వెళ్తుంది. శని, ఆదివారాల్లో ప్రయాణికుల సంఖ్య తగినంతగా లేని కారణంగా ఈ విమాన సర్వీసును తాత్కాలికంగా రద్దు చేశారు.
వైరల్ అవుతున్న శర్వానంద్, రామ్ చరణ్ ఫోటోలు….!
ముత్తూట్ గ్రూప్ ఛైర్మన్ జార్జ్ ముత్తూట్ కన్నుమూత..!
లాభ నస్టాలు లెక్క చెప్పిన సీఎం కేసిఆర్.. 2021-22 బడ్జెట్..!