Tuesday, April 30, 2024
- Advertisement -

విషమంగా సబ్బం హరి ఆరోగ్యం…

- Advertisement -

టీడీపీ నేత సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఏపిలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నేతలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. కొంత మంది కరోనా ని జయిస్తే మరికొంత మంది చనిపోయారు. ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో సబ్బం హరి విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ నెల 15న ఆయనకు కరోనా నిర్ధారణ కాగా, తొలుత ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నారు. అయితే లక్షణాలు తీవ్రతరం కావడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. కాగా, సబ్బం హరి ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా మారిందని డాక్టర్లు వెల్లడించారు. గత మూడ్రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన వెంటిలేటర్ పై ఉన్నారు.

తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టు తెలుస్తోంది. సబ్బం హరి ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

మ‌హారాష్ట్రలో మ‌ద్యం దొర‌క‌క శానిటైజ‌ర్ తాగిన వైనం.. ఏడుగురి మృతి

తెలంగాణలో కరోనా టీకా ఉచితం.. ప్రజల ప్రాణాలకన్నా డబ్బు ముఖ్యం కాదు : కెసిఆర్

కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 27 మంది మృతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -