బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు బుల్లితెరలో మరోవైపు వెండితెరపై నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.తన మాట తీరు అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనసూయ ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఎంతో బిజీగా ఉన్నారు.
యాంకర్ గా,నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే మే 15 అనసూయ పుట్టినరోజు కావడంతో, తన పుట్టిన రోజున తన కుటుంబ సభ్యులతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది.
Also read:ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ను గుర్తుపట్టారా?
ప్రస్తుతం కరోనా అధికంగా ఉన్న నేపథ్యంలో అనసూయ తన పుట్టిన రోజు వేడుకలను తన భర్త భరద్వాజ్, తన పిల్లలతో కలిసి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన పుట్టిన రోజును తన కుటుంబ సభ్యులతో కలిపి ఎంజాయ్ చేసిన అనసూయ, అందుకు సంబంధించి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ ఫోటోలలో అనసూయ తన కుటుంబంతో కలిసి బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్. ఇక తాజాగా అనసూయ కీలక పాత్రలో నటించిన “థాంక్యూ బ్రదర్” ఓటీటీ లో విడుదలయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే.