టాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ రాశి కన్నా ప్రస్తుతం తమిళ్, తెలుగు అన్న తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో రాశీ ఖన్నా హీరోయిన్ గా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘థాంక్యూ’.రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఇటలీ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కరోనా పరిస్థితుల కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.
హీరోయిన్ రాశి కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వ్యక్తిగత విషయాలు, మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం ఈమె అలవాటు. ఇటీవల కాలంలో నాగ చైతన్యతో వరుసగా సెల్ఫీలు పోస్ట్ చేస్తున్న రాశీ ఖన్నా ప్రస్తుతం మాస్క్ పెట్టుకొని ఎవరో కనుకోండి చూద్దాం అన్నట్టు పోజు ఇచ్చింది.ఆ సెల్ఫీలు చుసిన సమంత అభిమానులు అబ్బో అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.
Also read:రామ్ చరణ్ ఫస్ట్ లవర్ ఎవరో తెలుసా?
హీరోయిన్ రాశీ ఖన్నా తెలుగులో థ్యాంక్యూ సినిమా తోపాటు, పక్కా కమర్షియల్ మూవీలో గోపి చంద్ సరసన నటిస్తోంది. అలాగే హిందీలో షాహిద్ కపూర్ నటిస్తున్న ఓ వెబ్ సిరీస్లో హీరోయిన్గా చేస్తున్నారు. తాజాగా తమిళంలో కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్దార్ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.