తమిళనాడులో గత కొంత కాలంగా కరోనా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇక్కడ లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక కరోనా బాధితులకు సీఎం సహాయ నిధికి పలువురు స్టార్ హీరోలు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు విరాళాలు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను ఈ రోజు సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కలిశారు.
సీఎం సహాయ నిధికి రజనీకాంత్ రూ.50 లక్షల సాయం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును స్టాలిన్కు ఆయన అందజేశారు. ఇటీవలే సూర్య-కార్తి రూ.కోటి అందించారు. అలాగే, అజిత్, శివకార్తికేయన్ రూ.25 లక్షల చొప్పున విరాళాలు అందించారు. ఇక ప్రముఖ నటుడు విక్రమ్ కూడా తనవంతు విరాళం ప్రకటించారు. ఆన్ లైన్ ద్వారా 30 లక్షల రూపాయలను తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి బదిలీ చేశారు.
ఈ మద్యనే రజనీకాంత్ అల్లుడు విశాఖన్ వనంగ్ ముడి రూ.1 కోటి విరాళం అందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో విరివిగా విరాళాలు ఇవ్వాలని సీఎం స్టాలిన్ ఇటీవలే బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ సెలబ్రెటీలు వరుసగా విరాళాలు అందజేస్తున్నారు.
జబర్దస్త్ ఆనంద్ భార్యకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన రోజా.. ఏ విషయంలో అంటే?