టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల హాస్యనటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 250 సినిమాలో నటించిన పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమెను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సహా ఇండస్ర్టీకి చెందిన కొందరు దర్శక నిర్మాతలు, నటీనటులు ముందుకొచ్చి ఆమెకు చేతనైన సహాయం చేసి తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.
తాజాగా పావలా శ్యామల తనను ఆదుకున్న మా అసోసియేషన్ సభ్యులకు, చిరంజీవి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ తన బాధను ఇంటర్వ్యూలో వెల్లడించింది రెండేళ్ల క్రితం మా అమ్మాయికి టీబీ వ్యాధి వచ్చినప్పుడు నాకు చేతనైనంత వరకు మందులు ఇప్పించాను.అప్పుడు చిరంజీవిగారు వాళ్ల అమ్మాయితో రెండు లక్షలు ఇచ్చి ఆదుకున్నారు ఆ డబ్బుతో మా అమ్మాయిని మంచి డాక్టర్కి చూపించి, మంచి మందులు వాడాం. టీబీ వ్యాధి నయం అయిపోయింది. అయితే ఉన్నట్టుండి ఈమధ్య కింద పడడంతో మూడు చోట్ల కాలు ఎముకలు విరిగాయి. ఆపరేషన్ చేయించడానికి నాలుగు లక్షలు ఖర్చయింది.80 వేలు తక్కువ ఉండటంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు చెల్లించారు.
Also read:రెమ్యూనరేషన్ విషయంలో ఆ నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులు పంపిన శర్వానంద్?
అయితే ఆపరేషన్ చేయించిన తర్వాత మా అమ్మాయి బాధ చూడలేక, మందులు కొనలేక, బలమైన ఆహారం పెట్టలేక దాన్ని చంపేయాలని ప్రయత్నం చేశాను. కానీ కన్న మమకారం అడ్డొచ్చి ఆగాను అంటూ కన్నీరు పెట్టుకుంది పావలా శ్యామల. చిరంజీవి గారికి ఎంతో రుణపడి ఉంటాను. నాకు ‘మా’ సభ్యత్వం రుసుము చెల్లించారు. నేను చనిపోయినా ‘మా’ మెంబర్ని కాబట్టి అందరూ తీసుకెళ్లి దహన సంస్కారాలు చేస్తారు.ఇది ఆయన పుణ్యమే. నా బాధను చూసి మీరు జాలిపడి నన్ను అవమానించవదు. నా బాధ మీ మనస్సును కదిలిస్తే చేతనైన సహాయం చేయండి అంటూ. కన్నీరు పెట్టుకుంది.
Also read:వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పూనమ్ కౌర్.. కారణం అదేనా?